పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్న కోరిక ఇండస్ట్రీలో ప్రతీ నిర్మాతకి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది కల గా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. పవర్ స్టార్ అంటే ఫ్యాన్స్ లోనే కాదు నిర్మాతల్లోను క్రేజీగా ఫీలయ్యే వాళ్ళున్నారు. ఆ లిస్ట్ లో దిల్ రాజు ముందుంటారు. టాలీవుడ్ లో ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, రాం చరణ్, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్.. ఇలా దాదాపు అందరి స్టార్ హీరోలతో ఎన్నో చిత్రాలను నిర్మించిన దిల్ రాజు కెరీర్ లో డ్రీం ప్రాజెక్ట్ మాత్రం పవన్ తో ఒక సినిమా నిర్మించడమే అని చాలా సందర్భాల్లో తెలిపాడు.
అలా దాదాపు 10 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలనుకున్న కల ‘వకీల్ సాబ్’ తో నెరవేర్చుకోబుతున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిస్తున్న ‘వకీల్ సాబ్’ ని దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా భావించాడు. అదీకాక దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ రీ ఎంట్రీ సినిమా కావడం కూడా దిల్ రాజు కి కలిసొచ్చింది.
కానీ ఇంతలోనే కరోనా కారణంగా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోవడంతో ‘వకీల్ సాబ్’ థియేటర్స్ లో విడుదల అవుతుందా లేదా అన్నది సందేహం అంటున్నారు. ఇక రీసెంట్ గా దిల్ రాజు నిర్మించిన’ వి ‘ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత రెండు మూడు రోజుల నుంచి అమెజాన్ ప్రైమ్ వారు వకీల్ సాబ్ కు దాదాపు 100 కోట్ల భారీ ఆఫర్ ను దిల్ రాజు కి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ భారీ ఆఫర్ ను క్షణం ఆలోచించకుండా రిజెక్ట్ చేసినట్టు సమాచారం. చాలా కాలం తర్వాత పవన్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఎంత ఆలస్యం అయినా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ‘వకీల్ సాబ్’ ని థియేటర్స్ లోనే చూడాలనుకుంటున్నారు. ఇక దిల్ డ్రీం ప్రాజెక్ట్ ని ఇలా స్మాల్ స్క్రీన్ మీద రిలీజ్ చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు.