మీ డబ్బులకు ఏమీ డోకా లేదు. బయటి కంటే మీ డబ్బులకు అధిక వడ్డీ ఇప్పించడానికి నేను గ్యారంటి. నేను వ్యాపారం చేస్తున్నాను. మీడబ్బులకేమీ డోకా లేదంటూ అందరిని నమ్మించి కోట్లకు పంగనామాలు పెట్టింది ఓ మహిళా కేడి. చదివింది ఏడో తరగతే అయిన మోసం చేయడంలో తనకు మించిన వారు ఎవరూ లేరనే విధంగా చాలా మంది మహిళలను నట్టేట ముంచి సామాను సర్దేసింది. వివరాళ్లోకి వెలితే.. ఒడిషా లోని పైడిభీమవరం గ్రామానికి చెందిన లింగం నీలవేణి కొంత మంది మహిళల చేత చిట్టీలు కట్టించి ఎత్తడం వంటివి చేసేది.
ఈ చిట్టీల వ్యాపారం ఆమె 2015 లో మొదలు పెట్టింది. ఇలా చిట్టీలు పేరుతో ఆమెను చాలా మంది మహిళలు చేరువయ్యేవారు. దాంతో నీలవేణి 2017 లో అధిక వడ్డీల పేరుతో లక్షల్లో వసూలు చేయడం మొదలు పెట్టింది. ఇంకేముంది అధిక వడ్డీలంటే ఆశపడిన మహిళలు ఆమె చేతిలో కజానాను పోగుచేయడం మొదలుపెట్టారు. దాంతో నీలవేణి అందరిని నమ్మించడానికి వారికి రెండేండ్ల పాటు అందరికీ వడ్డీలు టైం ప్రకారం చెల్లిస్తుండేది. ఇంకేముంది అంతా మంచిగానే ఉంది మనడబ్బులకేమీ డోకా లేదు.. అధిక వడ్డీలు కూడా పొందవచ్చనే అత్యాశతో చాలా మంది మహిళలు నీలవేణికి లక్షల్లో డబ్బులను ఆమె చేతిలో పెట్టారు.
ఇక నీలవేణికి కాసుల వర్షం కురిపించేదుకు మహిళలందరూ సిద్దమయ్యారు. ఇక మహిళలు ఒక్కొక్కరూ సుమారుగా రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.70 లక్షలు, రూ.44 లక్షలు, రూ. 52 లక్షలు ఇలా పెద్ద మొత్తాలను తీసుకెళ్లి నీలివేణి చేతిలో పోశారు. ఆహా మంచి లాభాన్ని పొందిన నీలవేణి అసలు రంగును బయటపెట్టడం మొదలు పెట్టింది. ఇంకేముంది కొంత కొంత మొత్తాన్ని ఎవరికీ అనుమానం రాకుండా సొమ్మును కాజేసేది. ఏదో కుంటి సాకు చెప్పి రూ.2.60 కోట్ల సొమ్మును దొంగలు కొట్టేశారని అందరినీ నమ్మించింది.
పిచ్చి జనం అదికూడా నమ్మేశారు. అదే అదనుగా భావించిన నీలవేణి వడ్డీలను, చీటి డబ్బులను మహిళలకు ఇవ్వడంలో ఆలస్యం చేయడం మొదలు పెట్టింది. ఇంకేముంది నీలవేణిపై అనుమానం మొదలుపెట్టిన మహిళలు ఆమె ఇంటిముందు బైటాయించారు. విషయం నెత్తిమీదికొచ్చింది ఆ మహిళ మెల్లిగా రూ.20 కోట్లతో అక్కడినుంచి జారుకుంది. ఇంకేముంది అయ్యో మేము మోసాపోయామంటూ బాధిత మహిళలు నీలవేణిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరిని పడితే వారిని నమ్మితే ఇలాంటి మోసాలకు బలి కావాల్సిందేనని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మున్ముందు ఇలాంటి వాటికి మోసపోకుండా ఉంటారు.