ఫైసా.. ఎంతటి పనినైనా చేయిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బంధాలు, బంధుత్వాలు మర్చిపోయేలా చేస్తుంది. తన, మన అనే వాటిని మార్చేస్తుంది. ప్రేమ, కరుణ అనే పదాలను కూడా నాశనం చేస్తుంది. దానికి రోజు మనం చదువుతున్న వార్తలే నిదర్శనం. అలాంటి ఘటన మళ్లీ ఇంకొటి జరిగింది. ఫైసలకోసం సొంత అల్లుడిని ఎలా చంపాలి అని ఆలోచించేలా చేసింది. ముగ్గురితో బేరం మాట్లాడేలా చేసింది. చివరకు చంపించేసింది.
ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి పోతే.. సొంత కూతురి భర్తను మట్టుపెట్టడానికి ఓ మంచి ప్లాన్ వేసింది. అక్కడిక్కడా అయితే దొరికిపోత అనుకుందో ఏమో కానీ.. అందుకే అల్లుడితో కలిసి ఉండే ముగ్గురు వ్యక్తులతో బేరం మాట్లాడింది. అతన్ని చంపివేశాక రూ. 10 లక్షలు తీసుకుపోండి అంటూ ఆఫర్ ఇచ్చేసింది. పోలీసుల రంగ ప్రవేశంతో దొరికి కటకటాలు లెక్కపెడుతోంది.
ఆగ్రాకు చెందిన లాయర్ కపిల్ పవార్(45). అతని భార్య మమతా పవార్ ఏడాది కింద మృతి చెందింది. అప్పటి నుంచి తన అత్తతో ఆస్తి వివాదం మొదలైంది. ఎంతకీ ఇద్దరిమధ్య పొంతన కుదరకపోవడంతో కపిల్ పవార్ అత్త షిమ్లా పవార్(66) కు కోపం తన్నుకు వచ్చింది. దాంతో అన్వర్, రాహుల్, హర్ష యాదవ్ తో అల్లడి హత్యకు డీల్ కుదుర్చుకుంది. ఈ నెల 26న కపిల్ పవార్ కనిపించకుండా పోయాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏతవా జిల్లాలో కపిల్ పవర్ శవాన్ని గుర్తించారు. అతన్ని దారుణంగా హత్య చేసి డ్రైనేజీలో పడేసినట్లు విచరణలో తేలింది. చివరిసారిగా కపిల్ పవార్ ముగ్గురు వ్యక్తులతో కనిపించినట్లు తేలింది. వారు ఎవరనే దిశగా విచారణ జరిపారు. అందులో రాహుల్, అన్వర్, హర్ష యాదవ్ లను గుర్తించారు. వీరిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. అల్లుడిని చంపేసి రూ.10 లక్షలు తీసుకుపోమ్మని షిమ్లా పవార్ చెప్పడంతో అతన్ని హత్య చేసినట్లు వారు పేర్కొన్నారు.
కపిల్ పవార్ కనిపించకుండా పోయిన రోజు నిందితులు ముగ్గురు అతనితో కలిసి ఉన్నారు. కపిల్ పవార్ కు మత్తుమందు కలిపిన గుడ్లు తినిపించారు. దాంతో కపిల్ పవార్ మత్తులోకి జారుకున్నాడు. కారు సీటు బెల్టుతో ఉరి బిగించి కపిల్ ను చంపేశారు. తర్వత కపిల్ శవాన్ని ఏతవా జిల్లాలోని డ్రైనేజీలో పడేశారు. ఈ విచారణలో కపిల్ హత్యకు అతని అత్తకు ప్రమేయం ఉందని గుర్తించారు. దాంతో ఆ ముగ్గురు నిందితుల్లో ఇద్దరితో పాటు కపిల్ అత్తను కూడా అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు హర్ష యాదవ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.