Periods: ఋతుస్రావ కాలంలో స్త్రీలు దేవాలయంలోకి ప్రవేశించడం మరియు భగవద్ ప్రార్ధనలను మన భారతీయ సంప్రదాయం నిషేదించింది. ఈ విషయాన్ని స్త్రీ పురుష ఆధిక్యతకు సంబంధించినది కాదని గ్రహించాలి. ఈ విషయం స్త్రీల పట్ల మనకు ఉన్న గుర్తింపును తెలుపుతుంది.
పూర్వ కాలం లో ఋతుస్రావ కాలంలో స్త్రీ కి ప్రత్యేక గది మరియు పడకను ఏర్పాటు చేసేవారు. ఈ మూడు రోజులు అశుద్ధమైనవిగా తెలపబడినవి. ఆ కాలంలో దేవాలయ ప్రవేశం నిషేధమే కాక ఇంటి లోని పూజా గృహం వైపు కూడా రాకూడదు అనే నియమం ఉండేది. ఆ కాలం లో ఔషధ మొక్కల పరిసరాల దగ్గరకు కూడా వెళ్ళకూడదు అనే నియమం ఉండేది. ఋతుస్రావ కాలంలో స్త్రీ తన భర్త దగ్గరికి కూడా వెళ్ళకూడదు.
దైవ దీక్షలో ఉన్న పురుషుడు ఆ అయిదు రోజుల కాలంలో ఇంటికి దూరంగా ఉండి తమ వంట తామే చేసుకుని ఋతుస్రావ అయిన స్త్రీ సమక్షానికి దూరంగా ఉండాలి.
ఋతుస్రావ కాలంలో స్త్రీ యొక్క శరీర ఉష్ణోగ్రతలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ కారణంగా వారు ఆ సమయంలో దేవాలయాన్ని దర్శించినట్లు అయితే వారి శరీర ఉష్ణోగ్రతలోని మార్పు దేవుడి విగ్రహానికి చేటు చేసే అవకాశం ఉంది. దైవకృపాసక్తికి చేటు కలిగే అవకాశం ఉన్న కారణంగా ఈ నిషేధాన్ని మన పూర్వికులు ఏర్పాటు చేశారు.
రుతుస్రావం లో ఉన్న స్త్రీ సమక్షంలో పట్టు పురుగులు పంట పొలాలలో మరణించాడని శాస్త్రీయంగా నిరూపించడమయ్యినది. పట్టుపురుగులు ఒక్కసారిగా ఉష్ణోగ్రతలోని ఏ కొద్దీ మార్పుని కూడా భరించి బ్రతకలేవు. రుతుస్రావం గల స్త్రీ తన శరీరం నుంచి ఎక్కువ ఉష్ణోగ్రతను వెల్లడిస్తుంది కాబట్టి ఈ పట్టుపురుగులపై ప్రభావం ఉంటుంది.
పట్టుపురుగుల మాదిరి దేవాలయంలోని దేవుడి విగ్రహం పరిస్థితి కూడా అలాంటిదే. కాబట్టి ఇటువంటి నిషేధం ఎంతో విలువైనది.