ఒకానొక సమయంలో మనిషి మానవ మృగంలా మారతాడు అని చాలా చోట్ల మీరు చదివే ఉంటారు. అయితే, ఇలాంటి వర్ణనాతీత ఘటనలు కథల్లోనే ఉండేవి. అయితే, మనిషి మానవ మృగంలా మారతాడు అనేదానికి ఉదాహారణగా నిలుస్తూ అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక నిండు గర్భిణి ప్రాణాలు తీసి.. అనంతరం కడుపు కోసి గర్భంలో ఉన్న బిడ్డను తీసుకుని పారిపోయింది ఓ మహిళ. ఈ భయానక షాకింగ్ ఘటన టెక్సాస్లో చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టేలర్ పార్కర్ (27) అనే మహిళపై పలు నేరారోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే టెక్సాస్ లో ఉన్న ఓ జైలులో గత కొన్ని రోజులుగా ఉంటోంది. గత గురువారం 5 మిలియన్ల పూచికత్తుతో బెయిల్ పై విడుదల అయింది. జైలు నుంచి బయటకు రాగానే నేర ప్రవృత్తి కలిగిన ఆమె మరో దారుణానికి పాల్పడుతూ.. వారుంటున్న ప్రాంతంలోనే ఓ నిండు గర్భణిని దారుణంగా చంపింది. ఆపై మృతురాలి కడుపులో ఉన్న బిడ్డను తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించింది.
ఈ క్రమంలోనే నవజాత శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటే.. నిందితురాలు బిడ్డను తీసుకుని ఆస్ప త్రికి వెళ్లింది. తనకు రోడ్డు పక్కన ప్రసవం అయిందనీ, బిడ్డ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడనీ, వైద్యం ఆందించాలని డాక్టర్లను కోరింది. బిడ్డను పరీశించిన వైద్యులు అప్పటికే శిశువు ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. అయితే, నిందితురాలి ప్రవర్తన పై అనుమానం వచ్చి వైద్యులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తమదైన స్టైల్లో పార్కర్ను విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించింది. కేసు నమోదుచేసుకుని ఆమెను జైలుకు తరలించారు.