వంటింటికే పరిమితమైన అమ్మాయిల జీవితంలో రోజులు మారాయి. స్వేచ్చగా ఎగిరే హక్కును ఎవరూ కాలరాయకుండా ప్రపంచాన్ని అందుకుంటున్నారు నేటి తరం అమ్మాయిలు. ఆడది అంటే అభల కాదు సబల అని నిరూపిస్తూ అన్ని రంగాల్లో తమ ప్రతిభను బయటపెట్టుకుంటున్నారు. మేమే గొప్ప అన్ని విర్రవీగే మగవారికి ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు.
ఒకప్పుడు అమ్మాయిల పరిస్థితి గోరంగా ఉండేది. వంటిల్లుకే పరిమితి చేసేసి లోకం అంటే కేవలం ఇల్లు అనేదే ఆమెకు కనిపించేది. అమ్మాయే కదా చదువు సంద్యలెందుకమ్మా.. ఒకింటికి వెళ్లే దానికి చదువు కూడానా అని నాటి తల్లి దండ్రులు భావించేవారు. ఇక పెద్దమనిషి అవ్వడమే ఆలస్యం ఎప్పుడు పెళ్లి చేసి పంపుదామా అనే అలోచనే ఉండేది. కాని కాలంతో పాటుగా తరం మారిందీ.. తత్వమూ మారింది. 70 వ దశకం నుంచి అమ్మాయిలు స్వేచ్ఛగా ఎగరటం మొదలు పెట్టారు.
తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పటు చేసుుకుంటున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు సైతం వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమె ఎదగటానికి అన్ని విధాల సాయపడుతున్నారు. భూమి నుంచి గగన రంగంలో విహరిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నారు అమ్మాయిలు. కాగా నేటితరం అమ్మాయిలు పెళ్లి కంటే కెరీర్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీని కారణంగా ఆడవారి పెళ్లి వయస్సు రోజు రోజుకు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనంలో వెళ్లడైంది. దశాబ్దం కాలం కిందట ఆడవారి వివాహ వయస్సు 18 నుంచి 20 వరకు ఉండేది.
కాని నేడు మెజార్టీ అమ్మాయిలు 21 ఏండ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారని సర్వే తెలిపింది. 2006 లో దేశవ్యాప్తంగా యువతుల సగటు వివాహ వయస్సు 20.5 ఉండేది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 19.5 గా ఉండేది. కాగా తెలంగాణాలో సగటు వయస్సు 22 సంత్సరాలకు చేరిందని సర్వేలో వెళ్లడైంది. దీనితో పాటుగా గ్రామీణ యువతుల వివాహా వయస్సు 19.2 నుంచి 21.6 సంవత్సరాలకు పెరిగిందని అధ్యయనంలో తెలిపింది. కాగా ఆడవారి వివాహ వయస్సు మరింత పెరిగే అవకాశాలున్నాయని అధ్యయనం వివరించింది.