(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గుంటూరు: తాము మహిళలమే..తమకు రక్షణ కావాలంటూ పలువురు మహిళా పోలీసులు జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని వేడుకున్నారు. పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు ఆదివారం జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులను కలిశారు. రాజధానిలో ఉంది రైతులో, గుండాల్లో తెలియడం లేదని వారు అన్నారు. విధి నిర్వహణలో చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొంటున్నామని విన్నవించారు. ఉన్నతాధికారులకు చెబితే సర్దుకుపోండి అని సలహా ఇస్తున్నారనీ మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.