అమరావతి: రాజధాని తరలింపు ఆవేదనతో మహిళా రైతు మృతి చెందింది. మందడంలో భారతి (55) అనే మహిళా రైతు రాజధానిపై ఆవేదనతో తీవ్ర అస్వస్థతకు గురైంది. బుధవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజధాని కోసం భారతి కుటుంబం అర ఎకరం భూమిని ఇచ్చింది. రాజధాని ఉద్యమంలో సైతం భారతి చురుకుగా పాల్గొన్నది. ఆమె మరణంతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.
మరోవైపు రాజధానిని తరలించవద్దంటూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు 43వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తోందనే ఆందోళనతో ఇప్పటికే పలువురు రైతులు, రైతు కూలీలు ప్రాణాలు వదిలారు.