‘
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మనసు మార్చాలని పోలేరమ్మతల్లిని కోరుతూ అనంతవరం రైతులు, మహిళలు పొంగళ్లు నైవేద్యం పెట్టి వేడుకున్నారు.
అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని రైతులు, మహిళలు మొక్కుకున్నారు. అనంతరం వారు పొంగళ్లతో కాలినడకన ర్యాలీగా తుళ్లూరు మహా ధర్నా వద్దకు చేరుకున్నారు. రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు.
తుళ్లూరు, మందడం, వెలగపూడి తదితర గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.