WOMEN: అసలే గుంతలమయమైన రోడ్డులు, ఆపైన వర్షాలు పడడంతో బురదతో నిండి ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. వాహనదారులకు, పాదాచారులకు ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా మారింది. వాహనదారులు ప్రయాణ సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విషయం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో తమ ప్రాంతంలో అద్వాన్నంగా ఉన్న రోడ్ల దుస్థితిని తెలియచేసేందుకు, గుంతలమయమై, బురదతో నిండి ఉన్న రోడ్లను బాగు చేయాలని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని హోషాంగాబాద్ జిల్లాకు చెందిన మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
surgeon: దేవుడా.. కేవలం 7 గంటల్లో 101 మంది మహిళలకు సర్జరీ..?!
నడిరోడ్డు పైనే ఫ్యాషన్ షో చేస్తూ అక్కడ రోడ్ల దుస్థితిని, అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేసారు. మధ్యప్రదేశ్ లో రోడ్డు పై మహిళలు ఫ్యాషన్ షో చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నిరసనలో భాగంగా మహిళలు మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో రోడ్లు పూర్తిగా గుంతల మయంగా ఉన్నాయని.. వర్షం వస్తే గుంతల్లో నీరు చేరి బరదమయమై వాహనదారులకు, పాదచారులకు రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. నడిచేందుకు నరకప్రాయంగా ఉందని తెలిపారు.
MAA Elections: బండ్ల గణేష్ బిగ్ ట్విస్ట్..షాక్ లో ప్రకాాష్ రాజ్ ప్యానల్
ఎన్నిసార్లు మునిసిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగినా, మునిసిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, దీంతో చేసేదే లేక వినూత్న రీతిలో నిరసన తెలిపేందుకు ప్లాన్ చేశామని అన్నారు. అనుకున్నదే తడవుగా గుంతలతో, బురదమయంగా ఉన్న నడి రోడ్డు మీదే ఫ్యాషన్ షో నిర్వహించామని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేసేందుకే ఇలాంటి నిరసన తెలిపామని అన్నారు. ఈ రోడ్ల దుస్థితి చూస్తే అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. అధికారులు స్పందించి తమ ప్రాంతంలో రోడ్లకు మరమ్మతులు చేసి ప్రయాణికులకు, వాహనదారులకు వారి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా, ప్రమాదాలు జరగకుండా చూడాలని, అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకనైనా స్పందించకపోతే తాము చర్యలు తీసుకునేంత వరకు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Moringa: ఆరోగ్యానికి పర్మినెంట్ అడ్రస్ ఈ ఆకు..!!