.
మున్సిపల్ కమిషనర్పైనే పారిశుద్య కార్మికులు దాడికి పాల్పడటం కృష్ణా జిల్లా పెడనలో తీవ్ర కలకలాన్ని కల్గించింది. పెడన మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా పారిశుద్య కార్మికులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. మహిళా పారిశుద్య వర్కర్ లంకేశ్వరిపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నారని పారిశుద్య కార్మికులు ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డారు. అనంతరం వారు కమిషనర్ అంజయ్యపై పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు.
అయితే కమిషనర్ అంజయ్య పారిశుద్య కార్మికులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తనపై వారు ఎందుకు దాడి చేశారో అర్థం కావడం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే తాను మార్నింగ్ చేస్తుండగా దాడి చేశారని అంజయ్య పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై పెడన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కమిషనర్ పై పారిశుద్య కార్మికులు దాడికి పాల్పడిన విషయం జిల్లా వ్యాప్తంగా ఆ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?