ప్రజారోగ్యంలో ప్రపంచానికే పెద్ద దిక్కులా ఉండాల్సిన డబ్ల్యూహెచ్ఓ తన నమ్మకాన్ని పోగొట్టుకుంటుందా.. అంటే అవుననే అనిపిస్తున్నాయి పరిస్థితులు. ప్రపంచాన్ని కమ్మేసిన కరోనానను మొదట్లో చాలా లైట్ గా తీసుకుంది. ప్రపంచానికి కరోనా మహమ్మారిని అంటించేసిన చైనాను ఏమాత్రం అప్రమత్తం చేయలేదు. చైనా పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మొదట్లో ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపించదు అని చెప్పిందే డబ్ల్యూహెచ్ఓ. చైనా తప్పు లేదన్నట్టు వెనుకేసుకొచ్చినట్టు వ్యవహరించింది. చైనాలో ఏం జరుగుతుందోజజ వైరస్ వ్యాప్తి ఎలా జరిగిందో.. కనీసం పట్టించుకోలేదు. దీంతో ఈ ప్రపంచ ముప్పుకు పరోక్ష కారణంగా నిలిచింది.ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ నేపథ్యంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు సంస్థ చీఫ్. ఆయా దేశాలు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నాడు. చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసి మిగిలిన ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్ఓ వైఫల్యం చాలా ఉంది.
ఇప్పట్లో వైరస్ కు మందు రాదనే చీఫ్ మాటలు ఎలా తీసుకోవాలో ప్రపంచానికి అర్ధం కావడంలేదు. మొదట్లో వైరస్ పెద్ద ప్రమాదకారి కాదనేట్టు మాట్లాడి ఇప్పుడు మందు రాదనే సంకేతాలిస్తుంటే డబ్ల్యూహెచ్ఓ మాటలు నమ్మేదెలా అంటున్నాయి దేశాలు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి భయన్ని అంటగట్టింది. అందుకే.. కరోనా వ్యాప్తి ప్రారంభంలో డబ్ల్యూహెచ్ఓ సరైన హెచ్చరికలు జారీ చేయడంలో విఫలమైందని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందుకు ఆగ్రహం వ్యక్తం చేసి డబ్ల్యూహెచ్ఓ నుంచి యూఎస్ వైదొలగిన విషయం తెలిసిందే.