మహమ్మారి కరోనా వైరస్ ఉన్న కొద్దీ ప్రపంచంలో ప్రమాదకరంగా మారుతున్న విషయం అందరికి తెలిసిందే. మొదటిలో ఈ వైరస్ అరికట్టడం కోసం చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. అయినా గానీ పెద్దగా రిజల్ట్ లేకపోవడంతో పాటుగా మరో పక్క ఆర్థికంగా చాలా నష్టపోతున్న తరుణంలో ఇక లాభం లేదని చాలా దేశాలు లాక్ డౌన్ ఎత్హేస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు మరో వారం రోజుల్లో 10 మిలియన్ మార్క్ దాటే అవకాశం ఉందని, ఇంకా మరింత పెరుగుతాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ తెలిపారు.
కాగా లాక్ డౌన్ నుండి బయటపడిన దేశాలు మళ్లీ లాక్డౌన్ లోకి వెళ్ళకుండా… ప్రభుత్వ ఆదేశాలు ప్రజలు పాటించాలి అని, సోషల్ డిస్టెన్స్ మరియు మాస్కు ధరించాలి అని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యుడు డాక్టర్ మైక్ ర్యాన్ సరికొత్త భయపెట్టే వార్త చెప్పారు. అదేమిటంటే ప్రజెంట్ ఇంకా కరోనా వైరస్ అదుపులోకి రాలేదని రాబోయే రోజుల్లో లో వైరస్ సోకిన బాధితుల సంఖ్య మరణించే అవకాశం ఎక్కువగా ఉందని షాకింగ్ న్యూస్ తెలిపారు. ముఖ్యంగా దక్షిణాసియాలో లక్షలాదిమంది ఈ వైరస్ వల్ల పిల్లలు ప్రాణాలు విడిచే ప్రమాదముందని… అంతర్జాతీయ సర్వే లో బయటపడినట్లు మైక్ ర్యాన్ తెలిపారు.