Ganapathi pooja: పసుపు రంగు వస్త్రం
“పసుపు కొమ్ము తో చేసిన గణపతిని పూజించడం వలన మనకు ఎదురైయే ఇబ్బందులు తొలగిపోతాయి. పసుపుకొమ్ము తో చేసిన గణపతిని పూజామందిరంలో ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రం పరిచి దానిపై గణపతిని ప్రతిష్టించాలి.పసుపుకొమ్ము గణపతికి దూప,దీప నైవేద్యాలు సమర్పించుకుని మనసులో ఉన్న కోరికను చెప్పుకుని
ఓం హరిద్ర గణపతాయనమః అని అనుకుంటూ ప్రతిరోజు నూటఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి.
Ganapathi pooja: దేహ కాంతి
సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా పసుపు కొమ్ము గణపతిని పూజించుకోవాలి.
హరిద్ర గణపతిని పూజగదిలో పెట్టుకుని ఆరాదిస్తే ధనం, బంగారం వస్తు,వాహనాల వృద్ది జరుగుతుంది.
పసుపు గణపతి అనబడే హరిద్ర గణపతి పూజ చేసుకోవడం వలన దేహ కాంతి కూడా వృద్ధి చెందుతుంది.
ఎలాంటి చర్మ వ్యాధి అయినా కూడా నయం అవుతాయి. పసుపు గణపతి లేక హరిద్ర గణపతిని పూజించడం వలన ఇంట్లో పెళ్ళికావలిసిన అమ్మాయి లేదు అబ్బాయి కి ఉన్న వివాహ దోషాలుతొలగిపోయి వెంటనే పెళ్లి కుదిరి పోతుంది.
దుకాణల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలివుండే వస్తువుల మీద హరిద్ర గణపతిని తాకిస్తే వెంటనే అమ్ముడై పోతాయి.
హరిద్ర గణపతిని పూజించే వారికి డబ్బు ఇబ్బంది అనేది ఉండదు. అప్పులు కూడా తీరిపోతాయి.
పసుపు రాసిన కొత్త
వ్యాపారం సరిగా లేని షాప్స్ లో హరిద్రగణపతిని తీసుకుని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లా పెట్టిలో పెట్టుకుంటే వ్యాపార వృద్ధి జరుగుతుంది. ఆకుపచ్చ రంగులో,గుండ్రం గా ఉండే పెసలు సరిగ్గా 999 గ్రాములు తూకం వేసుకుని ,పసుపు రాసిన కొత్త గుడ్డలో మూటకట్టి వ్యాపార స్ధలంలో పెట్టుకోవడం వల్ల కూడా చేస్తున్న వ్యాపారం వృద్ది చెందుతుంది.