కర్మ సిద్ధాంతం నమ్మేవారు తప్పక వారి జీవితంలో వచ్చే కష్టాలను, ఇబ్బందులను పోవడానికి ఆయా దేవుళ్లను ఆరాధిస్తారు. వీటికి అనేక పురాణాలలో రకరకాల పద్ధతులను పేర్కొన్నారు. వాటిలో పుష్పార్చన ఒకటి. ఆయా పూలతో ఆయా దేవతలను పూజిస్తే మనకు మంచి జరుగుతుంది. నమ్మకంతో పూజలను చేస్తే తప్పక ఫలితాలు వస్తాయి. ఆ విషయాలు తెలుసుకుందాం…
సువాసన నిండి ఉన్న పూలతో పూజ చేస్తే..మీ జీవితం సుఖమయం అవుతుoది. .పూజకు ముందే పూల వాసనను ఎవరైతే చూస్తారో వారికీ అస్తమా, హృదయ సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు. ఎవరైతే దేవుని పూజకు మొగ్గలను వాడతారో వారి చిన్న పిల్లలకు ఆరోగ్య లోపం ఏర్పడుతుంది. ఎవరైతే దేవునికి కనకాంబరం పూలతో పూజచేస్తారో వారికీ జేవితంలో ప్రశాంతత లబించదు. కనకాంబరం పూలు పూజకు పనికిరావు. విచ్చని పూలతో పూజ చేస్తే..మీ పనులు చాలా ఆలస్యం గానూ, కొన్నిసార్లు చేస్తున్న పనులు నిలిచిపోతాయి
ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది. దేవునికి జాజి పూలు..అర్పించి ప్రసాదం స్వీకరిస్తే ..
మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి. దేవునికి సంపెంగ పూలు అర్పించి..ప్రసాదం స్వీకరిస్తే .. మాంత్రిక ప్రయోగాలు మీఫై పని చేయవు. శత్రువుల బాధ నివారణ సాధ్యం అవుతుంది. పారిజాత పువ్వుని అర్పిస్తే ..కాల సర్ప దోషం నివారించబడి మనస్సుకు శాంతి లబిస్తుంది.
4.రుద్రాక్ష పువ్వును అర్పిస్తే …ఎన్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం మీదే అవుతుంది.
కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర నివారణ. శ్రీమంతులు అవుతారు. మల్లె పువ్వుతో పూజిస్తే అన్ని రోగాలు నయం అవుతాయి .ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గన్నేరు పూలతో పూజిస్తే..
కవులకు కల్పనా సాహిత్యం వృద్ది చెందుతుంది. కంద పుష్పంతో పూజ చేస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది. తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే …
దేవునిఫై భక్తి అధికం అవుతుంది. నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే … జేవితంలో సుఖం ,శాంతి ,ప్రశాంతత లబిస్తుంది. కణగాలే పుష్పం …దీనితో దేవునికి పూజ చేస్తే.. మనస్సును పట్టి పీడిస్తున్న భయం ,భీతి తొలగిపోతాయి. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక భాదలు తొలగిపోతాయి .విద్య ప్రాప్తి సిద్దిస్తుంది. వకుళ పుష్పం శ్రీ భూవరాహ స్వామికి, శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి, సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది. తెల్లని జిల్లేడు పువ్వుతో శంకరునికి, సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి ,ఆరోగ్య్యం సిద్దిస్తుంది.
ఇలా చేయకండి !
దేవునికి విడి పూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యక ఫలితం లబిస్తుంది. దేవునికి ప్లాస్టిక్ పూలమాలను వేస్తే.. చర్మ వ్యాధి వస్తుంది. ఒకరు పూజ చేస్తున్నప్పుడు మరొకరు ఒక పువ్వు తీసుకొని పూజ చేస్తే..గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పాడయిన పూలతో పూజ చేస్తే..దేహంలో అయిన గాయాలు నయం కావు. పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే.. పుండ్లలో పురుగులు ఎక్కువ అవుతాయి.