డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలంటే ఒక ప్రత్యేకమైనవిగా ఉంటాయ. ఈయన చేసిన కొన్న సినిమాలైనా భారీగానే క్రేజ్ ను సంపాదించుకున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరీతో ఎంతో అందంగా తీయడంలో ఈయనకు ఈయనే సాటి అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా, సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కనున్న మూవీ లవ్ స్టోరీ.
ఈ సినిమాపై అభిమానులకు భారీగానే అంచనాలున్నాయి. దాంతోపాటుగా స్టోరీ ఓ రేంజ్ లో ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్టు సమాచారం. అయితే నాగ చైతన్య ఇంతకు ముందు నటించిన మూవీలన్నీ ఓవర్ బడ్జెట్ తో ఎప్పుడూ రాలేదు. కాని ఈ మధ్యన తెరకెక్కుతున్న ఆయన సినిమాలన్నీ ఆల్ మోస్ట్ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్ గా 2019 లో భారీ రికార్డును సొంతం చేసుకున్న సినిమా మజిలి. ఈ మూవీని 20 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించారు. అయితే తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కనున్న లవ్ స్టోరీ కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మించినట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు 35 కోట్ల బడ్జెట్ తో పూర్తైందని, కాగా కరోనా కాలంగా ఫైనాన్సియల్ పరంగా కలిసి మొత్తంగా ఈ మూవీకి 38 కోట్ల దాకా సినిమా తీయడానికి బడ్జెట్ అయిందని వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.
కాని ఇవి ఎంత వరకు నిజమనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే ఇదే కనుక నిజమైతే మాత్రం అక్కినేని నాగచైతన్య ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఇదే బిగెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కనున్న సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఇంత బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా వసూల్లను కూడా భారీగానే రాబడుతుందని వార్తలు వస్తున్నాయి.