బిగ్ బీ అమితాబ్ తో నటించే అవకాశాన్ని దక్కించుకున్న చిన్నది రకుల్ ప్రీత్ సింగ్. వరుస పరాజయాలు ఎదురవుతున్నా.. ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. అయితే ఈ అమ్మడు రాబోయే సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది. అయితే కొంత కాలంగా ఇంటికే పరిమితమైన సినీ హీరోయిన్లు ఇప్పుడు వెకేషన్ల పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ ఖాళీ సమయంలో చాలా మంది తారలు తమ కుటుంబసభ్యులతో కలిసి వారికి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. గోవా, మాల్దీవులు, దుబాయ్ లాంటి ప్రాంతాలను సిని తారలు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ కూడా తన కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తోంది.
ఆ టూర్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లోని సముద్ర తీరంలో ఎంతో ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. పొద్దు పొద్దునే సూర్యోదయ కిరణాల్లో బీచ్ లో యోగాసనాలు వేసింది. ఆ సమయంలో తీసుకున్న ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
సముద్రం దగ్గర విటమిన్ డీ ని పొందాలంటే ఇలా.. అంటూ ట్యాగ్ చేసింది. దాంతో పాటు యోగ చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది. అలాగే సముద్ర తీరంలో కూర్చొన్న ఇంకో ఫొటోని షేర్ చేస్తూ.. నవ్వుతూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలనే అర్థంలో ఇంకో క్యాప్షన్ పెట్టింది. ఆ ఫొటోలు ఇప్పుడ సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. రకుల్ సో బ్యూటీఫుల్ అంటూ పలువురు తనని ప్రసంశలతో ముంచెత్తుతున్నారు. రకుల్ బీగ్ బీ అమితాబ్ తో కలిసి నటించబోతున్నారని తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో షూరు కానుంది.