Wrap food in newspaper : సాధారణంగా రోడ్డు పక్కన బండ్ల మీద మిరపకాయ బజ్జీలు, పునుగులు, పూరీలు లాంటివి పేపరులో వేసి ఇస్తుంటారు. వాటిని మనం అలానే తినేస్తుంటాము. దీనిలో మనం ఏమీ గమనించము. కానీ దీని వల్ల దుష్పలితాలు ఉంటాయి అంటున్నారు వైద్య నిపుణులు. అది ఏమిటంటే.. పేపరు మీద కథనాలు ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఇంకులో గ్రాఫైట్ ఉంటుంది. పత్రిక పొడిగా ఉన్నంత సేపు అంటే చదివే సమయంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ పేపరు ఏమాత్రం తడిగా అయినా చాలా ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నూనెతో తయారు చేసిన బజ్జీలు, పునుగులు, పూరీలు ఇతర తినుబండారాలు పేపరులో ఉంచి ఆరగించడం వల్ల ఆ తినుబండారాల ద్వారా పేపరుపై ఉన్న గ్రాఫైట్ మన శరీరంలో చేరిపోతుంది. దీని వల్ల మూత్రపిండాలు, కాలేయాలను దెబ్బతీయడంతో పాటు ఎముకలు, కణజాలాల ఎదుగుదలను కూడా నిరోధిస్తుందని చెబుతున్నారు. సాధారణంగా మన శరీరంలోకి వివిధ మార్గాల ద్వారా చేరే ప్రమాదకరమైన విష పదార్ధాలు మల విసర్జన ద్వారా వెళ్లిపోతుంటాయి. కానీ గ్రాఫైట్ మాత్రం అలా వెళ్లదట. అది ఎక్కడికీ పోకుండా మన శరీరంలోనే పేరుకుపోతుందని, దాంతో ప్రమాదం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి న్యూస్ పేపరును కేవలం చదవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలనీ, తినుబండారాలకు న్యూస్ పేపరును ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. విషయం అర్ధం అయ్యింది కదా..తస్మాత్ జాగ్రత్త.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?