కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీతో భారత రెజ్లర్లు ఆందోళన విరమించారు. భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా గత మూడు రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం రెండో దఫా చర్చలు జరిపారు. బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్ల పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనీ, ప్రతిభ కలిగిన రెజ్లర్లకు అన్యాయం జరుగుతోందని, ఆయనను డబ్ల్యుఎఫ్ఐ నుండి తొలగించాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా జరుగుతున్న ఆందోళనలో భారత రెజ్లర్లు వినేష్ పోగల్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా 30 మంది పాల్గొనగా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి, ఇతర అధికారులు వీరితో పలు మార్లు చర్చలు జరిపారు. అయినా ఫలితం కనబడలేదు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తన నివాసంలో రెజ్లర్లతో రెండో దఫా చర్చలు జరిపారు. దాదాపు ఏడు గంటల పాటు జరిగిన చర్చలు ఫలప్రదమైయ్యాయి. అనంతరం రెజ్లర్లతో కలిసి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ .. మానిటరింగ్ కమిటీ వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించామని చెప్పారు. కమిటీ లో వ్యక్తుల పేర్లు ఆదివారం ప్రకటిస్తామని తెలిపారు. ఈ కమిటీ తన విచారణను నాలుగు వారాల్లో పూర్తి చేస్తుందని చెప్పారు. డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు భుషణ్ పై వచ్చిన అన్ని ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. విచారణ పూర్తి అయ్యే వరకూ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సంఘ రోజు వారి కార్యక్రమాలకు దూరంగా ఉంటారనీ, విచారణకు సహకరిస్తారని కేంద్ర మంత్రి రెజ్లర్లకు హమీ ఇచ్చారు. కేంద్ర మంత్రి హామీతో విచారణ పూర్తి అయ్యే వరకూ తమ నిరసనను విరమిస్తున్నామని ఏస్ ఇండియా రెజ్లర్ బజరంగ్ పునియా తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?