అనంతపురం: అనంతపురం ఆర్ట్స్ కళాశాల యాజమాన్యం ఎన్నికల నిబంధనలని ఉల్లంఘించింది. ప్రశ్నా పత్రంలో తెలుగు దేశం పార్టీ గురించి రాయమని ఉండటమే ఇందుకు కారణం.
అటానమస్ హోదా ఉన్న ఈ కాలేజీ సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకుంటుంది. ఈ క్రమంలో సోమవారం బిఏ సెకండ్ ఇయర్, నాలుగో సెమిస్టర్, పొలిటికల్ సైన్స్ పరీక్షలో ‘తెలుగుదేశం పార్టీ’ గురించి రాయమని అడిగారు.
కొందరు విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని సోషల్మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
బాధ్యతగల అధ్యాపకులు ఇలా ఒక పార్టీ వైపు యువతను ప్రేరేపించే విధంగా ప్రశ్నలు ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ప్రశ్నలు అడిగారని విద్యార్థులు సైతం విమర్శిస్తున్నారు.