WTC 2021-23: ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ రన్నరప్ హోదా తో సరిపెట్టుకుంది. ఫైనల్స్ లో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాభవం చవిచూసిన భారత్ కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండవ సైకిల్ కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు.
జూలై 2021 నుండి 2023 వరకు భారత్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో 6 టెస్ట్ సిరీస్ లను ఆడనుంది. మొదటగా ఆగస్టు 4వ తేదీ నుండి సెప్టెంబర్ 14 వ తేదీ మధ్యలో భారత్ ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ తో సైకిల్ మొదలుపెట్టనుండి.
ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత్ కు రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు వస్తారు. సొంతగడ్డపై భారత్ న్యూజిలాండ్ పై మొన్నటి ఫైనల్ లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ ఉంటుంది. టి20 ప్రపంచకప్ అయిపోయిన తర్వాత నవంబర్ లో ఈ సిరీస్ జరగవచ్చు. అది అయిపోయిన తర్వాత 2021 డిసెంబర్ నుండి 2022 జనవరి మధ్యలో సౌతాఫ్రికాలో భారత్ మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.
ఆ తర్వాత సొంతగడ్డపై శ్రీలంకతో మరో మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. 2022 రెండవ అర్థభాగంలో ఆస్ట్రేలియా భారత్ లో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇది భారత దేశంలో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫి ని గత రెండు సార్లు ఆస్ట్రేలియా పర్యటించి మన జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే.
భారత్ వరల్డ్ ఛాంపియన్షిప్ రెండో సైకిల్ ను బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ తో ముగిస్తుంది. మరి ఈసారి కూడా భారత్ ఫైనల్స్ కి వచ్చే అవకాశం ఉంటుంది అంటారా..?