అమరావతి, ఫిబ్రవరి 5: సంక్షేమ రంగానికి పెద్ద పీట వేస్తూ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం బడ్జెట్ ప్రతిపాదనలు సభకు సమర్పించారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడు ఉందంటూ, అయిదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో అన్నాదాతా సుఖీభవ అనే పధకాన్ని ప్రతిపాదించారు.
రూ.2.26.177.53 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. (గత ఏడాది కన్నా 18.38శాతం పెరుగుదల). ఇప్పటికే ఉన్న పలు పథకాలకు నిధులు కేటాయిస్తూ కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. వీటికి కూడా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు.
రెవెన్యూ వ్యయం రూ.1.80368.33కోట్లు (20.03శాతం పెంపు)
కేపిటల్ వ్యయం రూ.29.596.33కోట్లు (20.03శాతం పెంపు)
రెవెన్యూ మిగులు రూ.2099.47కోట్లు (అంచనా)
ఆర్థిక లోటు రూ.32.390కోట్లు (అంచనా)
బడ్జెట్ కేటాయింపులు
బిసి కార్పోరేషన్కు రూ.3000 కోట్లు
కాపు కార్పోరేషన్కు రూ.1000కోట్లు
బ్రాహ్మణ కార్పోరేషన్కు రూ.100కోట్లు
ఆర్యవైశ్యుల సంక్షేమానికి రూ.50కోట్లు
అన్నదాత సుఖీభవ – ఐదు వేల కోట్లు
దివ్యాంగుల సంక్షేమానికి రూ.70కోట్లు
క్షత్రియ కార్పోరేషన్ – రూ.50కోట్లు
గృహ నిర్మాణాల భూసేకరణకు రూ.500కోట్లు
ఎంఎస్ఎంఈలకు పోత్సాహం రూ.400కోట్లు
డ్రైవర్ల సాధికార సంస్థకు రూ.150కోట్లు
మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.100కోట్లు
వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.12.732.97కోట్లు
జలవనరుల శాఖకు రూ.16.852.27కోట్లు
వైద్య ఆరోగ్యంకు రూ.10,032.15కోట్లు
విద్యాశాఖకు రూ.22,783కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.35.182.61కోట్లు
వెనుకబడిన తరగతులు రూ.8252.64కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ.5382.83కోట్లు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు రూ.7979.34కోట్లు
రెవెన్యూ శాఖకు రూ.5546.94కోట్లు
సాంఘీక సంక్షేమంకు రూ.6861.60కోట్లు
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పూర్తి సమాచారం కొరకు కింద క్లిక్ చేయండి