Yasin Malik: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న అభియోగం కేసులో జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యూసిన్ మాలిక్ ను ఢిల్లీలోని పటియాల ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. ఎన్ఐఎ అభియోగాలను యూసిన్ మాలిక్ గత మంగళవారం అంగీకరించిన నేపథ్యంలో కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. తనపై మోపబడిన సెక్షన్ 16 (ఉగ్రవాద చట్టం), 17 (ఉగ్రవాద చర్యలకు నిధుల సేకరణ) మరియు 20 (ఉగ్రవాద ముఠా సభ్యుడు) తదితర సెక్షన్ల అభియోగాలను సవాల్ చేయడం లేదని మాలిక్ కోర్టుకు తెలిపారు. కాగా దోషిగా తేల్చిన యాసిన్ మాలిక్ కు ఎంత జరిమానా విధించాలో నిర్ధారించేందుకు గానూ ఆయన ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)ను కోర్టు ఆదేశించింది. ఈ నెల 25న కోర్టు యాసిన్ మాలిక్ కు శిక్ష ఖరారు చేయనుంది. స్వాతంత్య పోరాటం పేరుతో జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద మరియు ఇతర చట్టవిరుద్ద కార్యకలాపాల నిధులు సమీకరణకు మాలిక్ ప్రపంచ వ్యాప్తంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారని కోర్టు గతంలో పేర్కొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయాద్, హిజ్బుల్ ముజుహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ తో పాటు ఫరూఖ్ అహ్మద్ దార్ (బిట్టా కరాటే), షబ్బీర్ షా, మసరత్ ఆలం, ఎండి యూసఫ్ షా, అల్తాఫ్ అహ్మద్ షా, నయూంఖాన్, ఎండీ అక్బర్ ఖండే, రాజా మహ్రోజుద్దీన్ కల్వాల్, బహీష్ తదితర వేర్పాటు వాదులపై ఎన్ఐఎ చార్జ్ షీటు దాఖలు చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?