రక్తదాన శిబిరాల్లో ప్రపంచ రికార్డ్…ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదినోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రక్తదాన శిబిరాలు నిర్వహించారు.ప్రపంచంలో ఇప్పటి వరకు నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో ఇది ప్రపంచ రికార్డ్ ను తిరగరాసింది.
చాలా సందర్భాలలో రక్త దాన శిబిరాలు జరిగినా ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకే సారి 10,500యూనిట్ ల రక్తదానం రికార్డ్ కాగా నేడు రాష్ట్రంలోని 175 నియోజక వర్గాలతో నిర్వహించిన రక్త దాన శిబిరాల ద్వారా 34,723 యూనిట్ ల రక్తదానం చేసి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అతి పెద్ద బ్లాడ్ డొనేషన్ క్యాంపు గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కో ఆర్డినేటర్ నాగేంద్ర నాథ్, రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ విజయలక్ష్మి ధ్రువీకరించారు. వైసీపీ బ్లాడ్ డొనేషన్ క్యాంపు ప్రపంచ రికార్డ్ సాధించడంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రులు బొత్సా సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసిన అందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ బ్లాడ్ డొనేషన్ క్యాంపు లకు ప్రపంచ రికార్డ్ సాధించడం పట్ల వైసీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు.