అచ్చెన్న అరెస్టు.., అయ్యన్నపై నిర్భయ కేసు.., చంద్రబాబుపై సిబిఐ… లోకేష్ పై ఐటీ బాణం… తర్వాత ఇక టిడిపి వరుసలో ఉన్నదీ దేవినేని ఉమా, గల్లా జయదేవ్, బుద్ధ వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ అందరి కంటే ముందుగా పట్టాభిరామ్…, వీళ్ళు. ఇవన్నీ టిడిపి తరపున బాగా లేస్తున్న నోర్లు. కొన్నాళ్ళు కట్టడి చేయాలన్నా.., దారిలోకి తేవాలన్నా అందరి పాపాలు పైకి లేపడమే పని. ప్రభుత్వంలో ఓ విభాగం కూడా ఉంది. గత ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపే పనిలో ఉంది. దీనిలో భాగంగానే అప్పటి భూ కేటాయింపులను ఆరాతీస్తూ.., సమంజసం కాకపోతే.. తమకు అనుకూలం లేకపోతే రద్దు చేసేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు గల్లా జయదేవ్ వంతయ్యింది.
గల్లా కంపెనీకి కేటాయించిన భూము వెనక్కు…!
గల్లా జయదేవ్అ కి చిత్తూరు జిల్లాలో పెద్ద బ్యాటరీల కంపెనీ ఉంది అనే సంగతి తెలిసిందే. అమర్ రాజా ఇన్ఫ్రా టెక్ లిమిటెడ్ అనే పేరుతో మాంచి పేరున్న కంపెనీ అది. దీనికి కేటాయించిన 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ కింద గత ప్రభుత్వం అమర్ రాజా ఇన్ఫ్రా కు 253 ఎకరాలు కేటాయించింది. ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు లేక పోవడంతో వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్న ప్రభుత్వం. చిత్తూరు జిల్లా లోని బంగారు పాళెం నునిగుండ్ల పల్లి, కొత్త పల్లి లోని సర్వే నెం 65/1 భూములు వెనక్కి తీసుకుంటూ జీవో జారీ చేసింది. ఇంకా ఎన్నెన్ని భూములు, ఎవరెవరి లిస్టులో ఉన్నాయో..??