విల్లా గొడవలో చిక్కుకున్న వైకాపా నేత, ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెల్సిందే. బంజారా హిల్స్ పోలీసులు పివిపి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసారు.
విచారణకు రావాలని నోటీసులు జారీ చేసారు. అయితే పోలీసుల విచారణకు రాకుండా ఆయన కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీనిపై తెలంగాణ హైకోర్టు పివిపికి ఊరటనిచ్చే ఉత్తర్వలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ పివిపిని అరెస్ట్ చేయడానికి లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు జరీ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది. దీంతో బంజారా హిల్స్ పోలీసుల ప్రయత్నాలు అప్పటివరకూ నిలిచినట్లే.