అమరావతి: చంద్రబాబుకు తన వైఫల్యాలను వ్యవస్థలపై తోసివేయడం అలవాటని వైసిపి సీనియర్ నాయకుడు బొత్సా సత్యనారాయణ అన్నారు. స్పీకర్ కొడెల శివప్రసాద్పై దాడి ఘటనలో వైసిపి నేత అంబటి రాంబాబుతో సహా ముగ్గురు వైసిపి నాయకులపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
టిడిపి నేతలు వారికి ఉన్న అవలక్షణాలను ఎదుటివారిపై ఆపాదిస్తున్నారని బొత్సా దుయ్యబట్టారు.
స్ట్రాంగ్ రూమ్లలో ఇవిఎంలను మారుస్తారని భయం ఉంటే టిడిపి నేతలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద వలయంగా ఉండాలనీ, అవసరం అయితే చంద్రబాబే వెళ్లి స్ట్రాంగ్ రూమ్ దగ్గర పడుకోవాలని బొత్సా సూచించారు.
ఇక చంద్రబాబు పని అయిపోయింది అంటూ రాష్ట్రంలో 150 స్థానాల్లో వైసిపి ఘన విజయం సాధిస్తుందని బొత్సా ధీమా అన్నారు.