అమరావతి: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలకళ సంతరించుకొని ప్రకాశం బ్యారేజీ మీదుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కతూ సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) కవి హృదయం ఉప్పొంగింది. ఆనాడు రాజన్న, నేడు జగనన్న పాలనలో పల్లెపల్లె పులకించిపోయిందంటూ కవిత్వంతో ట్వీట్ చేశారు.
‘వానా వానా వెల్లువాయే
కొండా కోనా తుళ్ళిపోయే
కృష్ణమ్మ పరవళ్లు పొంగిపోయే
ప్రకాశం, శ్రీశైలం, నాగార్జున సాగరం నిండిపోయే
పల్లె పల్లె పులకించిపోయే
పదేళ్లు పట్టే..ఆనాడు రాజన్న, ఈనాడు జగనన్న…జైహో రైతన్న..’ అంటూ పివిపి ట్వీట్ చేశారు. ఒక పక్క పారిశ్రామికవేత్తగా, మరో పక్క రాజకీయ నేతగా వ్యవహరిస్తున్న పివిపి నేడు కవిగా మారి త్రిపాత్రిభినయం చేస్తున్నట్లుంది.
వానా వానా వెల్లువాయే
కొండా కోనా తుళ్ళిపోయే
కృష్ణమ్మ పరవళ్లు పొంగిపోయే
ప్రకాశం, శ్రీశైలం, నాగార్జున సాగరం నిండిపోయే
పల్లె పల్లె పులకించిపోయే
పదేళ్లు పట్టే..ఆనాడు రాజన్న, ఈనాడు జగనన్న…జైహో రైతన్న..— PVP (@PrasadVPotluri) August 14, 2019