అమరావతి: గతంలో మహమ్మద్ బీన్ తుగ్లక్ వ్యవహరించిన మాదిరిగా అమరావతి రాజధాని మార్పు అంశంపై సిఎం జగన్ వ్యవహరించవద్దంటూ విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని మొన్న చేసిన వ్యాఖ్యలపై వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) శనివారం స్పందించారు. కేశినేనిని ఘాటుగా విమర్శించారు.
‘చరిత్ర నీకెందుకురా అబ్బీ ! పొట్ట చింపితే అక్షరం ముక్క రాదు, ఎవడో తుగ్లక్ గాడు రాసిపెడితే, నువ్వు పోస్ట్ పెట్టడం. చరిత్రలో మనం ఉండకపోవచ్చు కానీ చరిత్ర మొదలయేది మనతోనే ! ఖబడ్ధార్.’ అంటూ పివిపి ట్వీట్ చేశారు. దీనికి మయన్మార్ రాజధానిని యాంగోన్ నుండి నేపైటాకు తరలించిన తరువాత జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచురించిన ఫోటోలతో కూడిన ఆర్టికల్ను ట్యాగ్ చేశారు.
మహ్మద్ బీన్ తుగ్లక్ 1328లో ఢిల్లీ నుండి రాజధానిని మహారాష్ట్రలోని దౌలతాబాద్కు తిరిగి ఢిల్లీకి మార్చిన వైనాన్ని ఉదహరిస్తూ కేశినేని జగన్పై విమర్శలను సంధించిన విషయం తెలిసిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?