అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రపంచంలో కెల్లా శ్రేష్టమైన పప్పులను తయారు చేసి వదులుతున్నారంటూ వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ విమర్శించారు. కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకే కృత్రిమ వరదలు సృష్టించారనీ టిడిపి నేతలు చేస్తున్న విమర్శలపై పివిపి తన దైన శైలిలో వ్యంగ్యంగా విమర్శలు చేశారు. చంద్రబాబు స్థాపించింది పాల ఫ్యాక్టరీనా లేక పప్పుల ఫ్యాక్టరీనా అని పివిపి ప్రశ్నించారు. ప్రజాక్షేమం కోరే పెద్దలైన వారు కృష్ణానది వరదలపై హాహాకారాలు పెడుతున్నారని పివిపి విమర్శించారు. కృతిమ వరదలు పుట్టించడం ఏమిటని ప్రశ్నిస్తూ, కాస్త వాళ్ల బుర్రలో ఇస్మార్ట్ చిప్స్ పెట్టండి అని పివిపి సైటైర్ వేశారు.
previous post
next post