అమరావతి: ప్రజావేదికపై తాను గానీ, తమ పార్టీ గానీ ఎటువంటి లేఖలు ప్రభుత్వానికి రాయలేదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పేర్కొన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో తన పేరుతో ప్రచారం జరుగుతున్న వార్తలపై ఆయన నేడు స్పందించారు.
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ప్రజావేదికను కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాసిన నేపథ్యంలో ఆ ప్రజావేదికను వైసిపి కేటాయించాలని తలశిల రఘురాం ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి.
మీడియాలో వస్తున్న కథనాలను రఘురాం ఖండించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?