గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ బాగా వార్తల్లో నిలుస్తున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ వైసీపీ నేత రజాక్ పై కూడా సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్రీశైలం వైసిపి ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తనని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, దమ్ముంటే వాటిని నిరూపించగలరా అంటూ రాజా సింగ్ కి సంచలన సవాల్ విసిరారు వైసిపి నేత రజాక్.
చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాతో సహా చక్రపాణి రెడ్డి రెడీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శ్రీశైల మల్లికార్జున స్వామిని ఏ మతానికి చెందిన వారైనా పూజించవచ్చు రజాక్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇతర మతాలకు చెందినవారు పూజించకూడదు అని హిందూ మత గ్రంథాలలో ఎక్కడైనా ఉందా రాశారా అంటూ రజాక్ ప్రశ్నించారు.
శ్రీశైలం దేవస్థానం లో తన పేరిట ఎలాంటి పనులు జరగలేదని అదేవిధంగా ముస్లింలకు శ్రీశైలంలో ఎలాంటి కాంట్రాక్టులు ఇప్పించలేదని పేర్కొన్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి అంటూ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై రజాక్ భారీ స్థాయిలో కౌంటర్లు వేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?