ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూలో స్పందించారు.
బైబిల్ పార్టీ కావాలా..? భగవద్గీత పార్టీ కావాలా..? అంటూ తిరుపతి ఉప ఎన్నికల విషయంలో స్పందించిన బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల మంత్రి వెల్లంపల్లి ప్రతిస్పందిస్తూ.. నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం క్రైస్తవులకు జెరుసలేము యాత్ర ఫ్రీగా పంపిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది, మరి అప్పుడు బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదు అంటూ హైపర్ పంచ్ వేశారు.
కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టి పొలిటికల్ మైలేజీ సంపాదించుకోవడం కోసం బండి సంజయ్ తాపత్రయపడుతున్నాట్టుగా వెల్లంపల్లి పేర్కొన్నారు. అదేవిధంగా క్రైస్తవ సమావేశాలకు కూడా బండి సంజయ్ వెళ్ళటం జరిగిందని..ఏ ఉద్దేశంతో బండి సంజయ్ ఇలాంటి మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారని, ఆయన సలహాలు తీసుకొని అంత స్థితిలో వైసీపీ లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. భారతదేశంలో ఏ మతానికి ఆ మతం గొప్పదని అన్ని మతాలను సమానంగా చూడటమే ప్రభుత్వాల యొక్క విధానమని, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.