అమరావతి: సదావర్తి భూములపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అసెంబ్లీలో సదావర్తి భూముల అంశంపై జరిగిన చర్చలో వైసిపి సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొంటూ, సదావర్తి భూముల కుంభకోణంపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. దీనిపై మంత్రి వెల్లంపల్లి సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందని పేర్కొన్నారు.
దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విచారణను స్వాగతిస్తున్నానని చెప్పారు. వాస్తవాలను వక్రీకరించి బురద చల్లడం మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. సదావర్తి భూముల వివాదం ఎప్పటి నుండి ఉంది, ఆ భూములు ఏలా వచ్చాయి, సుప్రీం కోర్టు తీర్పులు, బహిరంగ వేలం పాటల నిర్వహణ తదితర అంశాలను చంద్రబాబు వివరించారు.
కియా మోటార్స్ దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల వచ్చిందని నిన్న అసెంబ్లీలో చెప్పడంపై చంద్రబాబు మాట్లాడుతూ మంత్రి బుగ్గన తెలివితేటలు అమోఘం అంటూ ప్రశంసించారు.