అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఓటుకు నోటు కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.
తన పిటిషన్ను త్వరగా విచారించాలని ఆయన ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలు చేశారు. 2017లోనే ఆర్కే ఈ పిటిషన్ వేసినా అద సుప్రీం కోర్టులో లిస్టింగ్ కాలేదు. దీంతో మరో సారి సుప్రీం కోర్టు గడపతొక్కారు.
ప్రస్తుతం ట్రయిల్ కోర్టులో ఏ 1 నుండి ఏ 5 వరకూ మాత్రమే విచారణ జరుపుతున్నారనీ, చంద్రబాబు మీద విచారణ జరపడం లేదనీ ఆయన కోర్టుకు తెలిపారు. చంద్రబాబు మీద కూడా విచారణ జరిపించాలనీ, ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని ఆర్కే కోరారు.