హైదరాబాదు: మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకూ సమీక్షలపై నానాయాగి చేస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు, పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు ఆయన మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
సమీక్షలను ఎవరో అడ్డుకుంటున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వారి అవినీతిని సిఎస్ అడ్డుకుంటే మంత్రులు,ముఖ్యమంత్రి యాగి చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడ అవినీతికి సంభందించి ఆధారాలు దొరుకుతాయో వాటిని తుడిచిపెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని గోవర్ధన్ రెడ్డి అన్నారు.
ఐదు సంవత్సరాలు సమస్యలపై దృష్టి పెట్టకుండా నేడు అదికారాల గురించి మాట్లాడుతున్నారని గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు.
నిన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష చేద్దామని సచివాలయానికి వెళ్తే అదికారులు రాకపోవడంతో మూడు గంటల సేపు డిస్కోడాన్స్ చేశారని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మళ్లీ తర్వాత రోజు సైతం ప్రయత్నిస్తే అధికారులు రాలేదనీ సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారని గోవర్ధన్ రెడ్డి నిమర్శించారు.
రైతుల రుణాలను మాఫి చేయకుండా వారి .రుణబారాన్ని రెట్టింపు చేశారని అన్నారు.
‘రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదు.స్వామినాధన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయలేదు.నీవు వ్యవసాయమంత్రివి కాదు కిరాయిమంత్రివి’ అంటూ గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.
‘మంత్రి యనమల అసెంబ్లీలో ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుంటామంటే ఏదో అనుకున్నాం.
ఇప్పుడు సంక్షోభమైన ఫోని తుపానులో కూడా దండుకుందామనే అవకాశంగా మలచుకుంటున్నారు.
తుపాను నిధులు పిండుకోవడానికి ఉన్న ఆతృత రైతు సమస్యలపై మీకు లేదు’అంటూ గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.
‘నేను ప్రమాణస్వీకారం చేసిన తేదీ ఆధారంగా పలానా తేదీ వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు తప్పితే మరొకరు లేరు’అని గోవర్ధన్ రెడ్డి అన్నారు.
తమ పార్టీ అధినేత జగన్ ఫోని తుపాను నేపధ్యంలో పార్టీ నేతలతో సమీక్ష చేసి కార్యకర్తల ద్వారా ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని గోవర్థన్ రెడ్డి తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?