(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి:రాష్ట్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని వైసిపి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా శుక్రవారం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. గూడురు మండలం నుంచి పెడన పట్టణం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. ప్రాంతీయ అసమానతలు లేకుండా సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే సిఎం జగన్ లక్ష్యమని ఆయన అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?