YCP MLA RK Roja: వైసీీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్ కే రోజా సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల నగరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఆమె సీరియస్ గా స్పందించారు. వైసీపీలోనే తన వ్యతిరేక వర్గంగా ఉన్న చక్రపాణి రెడ్డికి శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చారు. దీనిపై ఆమె ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రాజీనామాకు సిద్ధమవుతున్నారు అంటూ వార్తలు వినబడ్డాయి. సోషల్ మీడియాలో పార్టీ మారనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై రోజా స్పందిస్తూ తానకు పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
YCP MLA RK Roja: అన్నీ దిగమింగుకుని పార్టీలోనే కొనసాగుతున్నా
జగనన్నను ప్రేమించే తాను పార్టీ పెట్టకముందు నుండి ఉన్నానని అన్నారు. అందరూ పల్లెల నుండి వెళ్లి పట్టణాల్లో ఇల్లు కట్టుకుంటుంటే తాను నగరిలో ఇల్లు కట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని పేర్కొన్న రోజా.. జగనన్న కోసం అవమానాలు అన్నీ దిగమింగుకుని పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పారు. తాను పార్టీ మారనని స్పష్టం చేస్తూ అవసరమైతే రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. తాను ఎన్నో పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ తప్పు చేసిన వాళ్లే పార్టీని వీడి పోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
YCP MLA RK Roja: నిరాధార ఆరోపణలు చేస్తే మూతి పగులగొడతా
టీడీపీ నేత గాలి భానుప్రకాశ్ చేస్తున్న ఆరోపణలపైనా తీవ్రంగా స్పందించారు. నోటికి వచ్చినట్లు నిరాధార ఆరోపణలు చేస్తే మూతి పగులగొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు రోజా. నగరిలో గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ దందాలో రోజాకు కూడా భాగం ఉందంటూ గాలి భానుప్రకాశ్ ఆరోపణలు చేశారు. దీనిపై ఆమె ఘాటుగా స్పందించారు. తాను అక్రమంగా సంపాదిస్తున్నానని ఆరోపణలు చేసే వారికి అవసరమైతే తన బ్యాంకు బ్యాలెన్స్ వెల్లడి చేస్తానని స్పష్టం చేశారు. వైసీపీలో ఉన్న కొందరి సహకారంతో తనను ఓడించాలని భావిస్తే అది వారి పగటి కలగానే మిగిలిపోతుందని రోజా వ్యాఖ్యానించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?