YCP MLA: ఏపిలో గత కొద్ది రోజులుగా ఏదో ఒక వివాదం హాట్ టాపిక్ మారుతూ వస్తుంది. మొన్న వంగవీటి రాధ వ్యాఖ్యల దుమారం., ఆ తరువాత సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలు, తదుపరి గుంటూరు జిన్నా టవర్ ఇష్యూ సంచలన వార్తాంశాలుగా చర్చనీయాంశం అవుతున్నాయి. వీటిపై సోషల్ మీడియాలో నెటిజన్ ల కామెంట్స్, న్యూస్ ఛానల్స్ లో చర్చా వేదికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో వివాదానికి ఆజ్యం పోశారు ఓ వైసీపీ మహిళా ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా ఉన్నాయంటూ అంబేద్కరిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆ మహిళా ఎవరు. ఆమె ఏమి మాట్లాడారు ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం ఎందుకు అయ్యాయి అనేది తెలుసుకుందాం.
YCP MLA: బాబూ జగ్జీవన్ రామ్ వల్లే రాజ్యాంగ హక్కులు
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఓ ప్రైవేటు కార్యక్రమంలో మాట్లాడుతూ.. అంబేద్కర్ వల్ల మనకు వచ్చింది ఏమీ లేదని అన్నారు. ఆయన వల్ల మనకు వచ్చిన హక్కులు ఏమి లేవని వ్యాఖ్యానిస్తూ.. బాబూ జగ్జీవన్ రామ్ వల్లే మనకు రాజ్యాంగ హక్కులు సంక్రమించాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాబూ జగజ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకోవాలని, ఆ స్పూర్తితో ముందుకు సాగాలని శ్రీదేవి అన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి.
క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే శ్రేదేవి వ్యాఖ్యలపై అంబేద్కరిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు శ్రీదేవి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై వర్ల రామయ్య మాట్లాడుతూ తొలి నుండి అంబేద్కర్ అంటే వైసీపీ నేతలు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ ను ఆ పార్టీ ముఖ్య నేతలు కించపర్చడం చాలా సార్లు చూశామని అన్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవి అంబేద్కర్ ను కించపరుస్తూ మాట్లాడారన్నారు. తక్షణం ఆమె క్షమాపణ చెప్పాలని కోరారు. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
Read More: PRC: ఏపిలో ఉద్యోగులకు న్యూఇయర్ గుడ్ న్యూస్ లేనట్లే(గా)..?