(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
గుంటూరు : చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. శివరాత్రి సందర్భంగా విడదల వారి ప్రభను కోటప్పకొండలో పెట్టి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన సమయంలో ఎమ్మెల్యే రజని భర్త కుమార్తో పాటు మరిది గోపి ఆ కారులో ఉన్నారు. రాళ్ల దాడి వల్ల కారు ముందు, వెనక అద్దాలు ధ్వంసం కావడంతో పాటు గోపికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ దాడి చేసింది టీడీపీ వర్గీయులేనని వారు ఆరోపిస్తున్నారు. ఘటనపై రజనీ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పోలీస్ ఉన్నతాధికారులు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు కారుపై కూడా దాడి జరిగింది.