వైసిపిలో ఏదో జరుగుతోందనే తప్పుడు సంకేతాలను ప్రజలకు ఇవ్వడానికి ఎల్లో మీడియా తన వంతు ప్రయత్నాలు నిర్విరామంగా చేస్తోంది.
ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రదేశ్లో అక్కడక్కడా వైసీపీ నేతలు కొద్దిగా ధిక్కార స్వరం వినిపిస్తుండడాన్ని మీడియా భూతద్దంలో చూపుతోంది.కరుడుగట్టిన పచ్చ పత్రికలు ఈ విషయంలో చాలా ముందుండగా నిన్నమొన్నటి వరకు సంయమన ధోరణి పాటించిన ఈనాడు కూడా ఇప్పుడు అదే బాట పట్టింది.వైసీపీ అగ్రనేతలు సజ్జలకు,విజయ సాయిరెడ్డికి మధ్య విభేదాలు ఉన్నట్లు,విజయసాయిరెడ్డి ,టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పోట్లాడుకుంటున్నట్లు రాసేసిన పచ్చ పత్రికలు అంతటితో ఆగకుండా ఏకంగా ముఖ్యమంత్రి జగన్ విజయసాయిరెడ్డి మధ్యకూడా పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్నట్లు ప్రత్యేక కథనాలు వండి వార్చాయి. చివరకు మంత్రులు కూడా జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు మరికొన్ని విషపూరిత స్టోరీలను నాటారు.వైసీపీలో చిచ్చు పెట్టడమే ధ్యేయంగా పచ్చ మీడియా ఈ తరహా వార్తలు రాస్తున్న విషయం నిర్వివాదాంశం.ఇదంతా టిడిపి దాని అనుకూల మీడియా మైండ్ గేమ్ అన్నది కూడా అర్థమైపోతోంది.అయితే ఈ విషయంలో అధికార పార్టీ అనుకూల మీడియా తప్పిదం కూడా ఒటి కనిపిస్తోంది.ఈ కేటగిరి మీడియాలో ముఖ్యమంత్రికి మంత్రులకు తప్పితే ఎమ్మెల్యేలు ఇతర వైసీపీ అగ్రనేతలకు తగిన ప్రచారం లభించడం లేదు.ఒకవైపు ఎల్లో మీడియా ఎలాగూ తమను పట్టించుకోవడం లేదు అధికార పార్టీ మీడియా కూడా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తి కిఇది బాటలు వేసింది.ఏడాది కాలంలో నిర్లక్ష్యాన్ని గురయ్యేమన్న భావన రావడంతో సీనియర్లు తమ ఉనికిని చాటుకోవడానికి ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు..ఒకరిని చూసి మరొకరు ఏదో ఒక విధంగా ప్రచారం వస్తుందనే ఉద్దేశ్యంతో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు .దీన్నే ఎల్లో మీడియా సొమ్ము చేసుకుంటోంది.వీటన్నింటినీ కలగలిపి రాస్తూ వైసిపిలో ఏదో జరిగిపోతోందన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకిపంపడానికి ఎల్లో మీడియా శక్తి వంచన లేకుండా పాటుపడుతోంది.తాము టిడిపి ట్రాప్లో పడుతున్నారన్న విషయాన్ని వైసిపి ఎమ్మెల్యేలు ముఖ్యంగా గుర్తించలేకున్నారు.పరిస్థితి చేజారకముందే వైసిపి అధిష్ఠానం కూడా మేల్కొని పూర్తి డ్యామేజ్ జరక్కుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది .