గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింత రాజకీయం చోటు చేసుకుంటోంది. ఏ రాష్ట్రంలో అయినా ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీలో గొడవలు ఉంటాయి. దెబ్బతిన్న నాయకులు ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుకుంటారు. ఇక ఘనంగా అధికారం చేపట్టిన పార్టీలో పరపతి, డబ్బు, హోదా ఉండే నేతల అందరికీ ఉంటుంది అన్యోన్యంగా ఉండడం చూస్తాం.
కానీ ఏపీలో వైసీపీ దగ్గరికి వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. టిడిపి సంగతి పక్కన పెడితే వైసీపీలో స్థానిక నేతల మధ్య రగడ ఎక్కువైపోయింది అని టాక్. ఇదంతా టిడిపి నుండి వచ్చిన వారు వైసిపి స్థానిక నేతలతో ఇమడలేకపోవడమే అన్నది ఒక థియరీ. ఇక వైసీపీలోనే ఒక్కో ప్రాంతంలో ఆధిపత్యపోరు కోసం జరిగిన పంచాయితీలు ఎన్నో చూశాం.
తాజాగా అధికార పార్టీకి చెందిన. ఎంపీలు ఎమ్మెల్యేలు బహిరంగంగా గొడవ పడటంతో ఇద్దరు నేతల పై జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. కాకినాడలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా డిఆర్సి సమావేశంలో వైసీపీ నేతల మధ్య జరిగిన రగడ వళ్ల పార్టీ పేరు పోయింది అని అంటున్నారు. ఇటువంటి వాటిపై ఏమాత్రం ఉపేక్షించే అలవాటు లేని జగన్ వెంటనే ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలను తనను కలవాలని పెట్టినట్లు సమాచారం.
ఇక రాజ్యసభ ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అమరావతి కి తరలి వెళ్లారు సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమావేశం లో జగన్ వారి దగ్గర నుండి వివరణ పొందినట్లు తెలిసింది. కాకినాడ లో జరిగిన సమావేశంలో అలా బహిరంగంగా తీవ్ర ఆరోపణలను పరస్పరం చేసుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న జగన్ వారి ఉద్దేశాలు ఏమిటో వాకబు చేసినట్లు చెబుతున్నారు.
ఇప్పుడే ఘనమైన ప్రస్థానం ప్రారంభించిన వైసీపీ పార్టీ లో వ్యవహరించవద్దని జగన్ చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై అటు బోస్ కానీ ఇటు ద్వారంపూడి కాని ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ వారి మధ్య వ్యవహారం సద్దుమణిగినట్లు అనిపిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలకు ముందు స్థానిక నేతల విషయాలపై అందరూ ఆందోళన చెందుతుంటే…. జగన్ మాత్రం ఇటువంటి క్లిష్ట మ్యాటర్లను తానే స్వయంగా జోక్యం చేసుకొని తేలికగా సాల్వ్ చేస్తూ ముందుకు పోతున్నారు.