వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు హైకోర్టులో రెండు క్వాష్ పిటిషన్లు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పోడూరు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం కోర్టుకెళ్లారు. ఈ విచారణని కోర్టు వాయిదా వేసింది. ఎంపీ తమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని, తమ ప్రతిష్టకి భంగం కలిగించారని ఆరోపిస్తూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఇదే విషయమై మంత్రి రంగనాథరాజు పోడూరు స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఈ పిటిషన్లపై పోలీసులు కేసులు నమోదు చేసారు. అయితే వీటిపై ముందడుగు పడకుండా ఉండేందుకు ఎంపీ అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేల కేసులకు వ్యతిరేకంగా, తనపై ఎటువంటి చర్యలకు దిగకుండా కోర్టుకెళ్లారు. ఈ టాపిక్ జిల్లాతో, పాటూ రాష్ట్రంలో కూడా హాట్ గా మారింది.