(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఇరుకున పెట్టేలా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజుకు అదే పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
దళిత ఎంపిగా ఉన్న తనను ఉద్దేశించి రఘురామ కృష్ణం రాజు అవహేళన చేసే విధంగా మాట్లాడారనీ, దీనిపై జాతీయ ఎస్సి, ఎస్టి కమిషన్ సభ్యులైన రాములుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు నందిగం సురేష్. తమ అనుచితంగా మాట్లాడిన రఘురామ కృష్ణం రాజుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని కూడా తొలగించాలని కోరనున్నట్లు తెలిపారు. ఏవరితో పెట్టుకోకూడదో వారితోనే రఘురామ కృష్ణం రాజు పెట్టుకున్నారు, దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలిసి వస్తుందన్నారు.
ప్రివిలైజ్ నోటీసు ఎవరికి ఇవ్వాలో, ఏ సందర్భంలో ఇవ్వాలో అవగాహన కూడా రఘురామ కృష్ణంరాజుకు అవగాహన లేదనీ విమర్శించారు నందిగం సురేష్. సహచర ఎంపి మీద ప్రివిలైజ్ నోటీసు ఇవ్వడం ఏమిటని ఏద్దేవా చేశారు.