టిడిపి మాజీ మంత్రి అచ్చన్నాయుడు అరెస్టుపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలనే షాక్ కి గురి చేసేలా ఉన్నాయి. అచ్చెన్నాయుడు నిజంగాతప్పుచేస్తే చర్యలు తీసుకోవాలని కానీ గోడ దూకి మరీ అరెస్ట్ చేయాల్సిన అవసరంలేదని ఆయన అన్నారు.
అంతేగాక టీడీపీ నేతలు రోజుకొకరు అరెస్ట్ అవుతారని మంత్రులు అనడం సరికాదని, మంత్రుల వ్యాఖ్యలతో నిజంగా వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని అనుకుంటారని అది ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే అచ్చెన్నను పరామర్శించడానికి చంద్రబాబును అనుమతించకపోవడం నిజంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని కూడా వైసీపీ ఎంపీ రామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు ఖండిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
రఘురామ కృష్ణంరాజు వైఖరి వైసిపి నేతలకు చికాకు కలిగిస్తోంది.ఇటీవల అనేక సందర్భాల్లో కూడా వైసిపి ప్రభుత్వ విధానాలను తప్పుపట్టేలా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.ముఖ్యంగా ఇసుక విషయంలో రఘురామకృష్ణంరాజు ప్రభుత్వంపై చాలా తీవ్రమైన విమర్శలు చేశారు.ముఖ్యమంత్రి జగన్ను ధిక్కరించే ధోరణిలో వ్యవహరిస్తున్నది ఒక్క రఘురామకృష్ణంరాజేనని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.అతి త్వరలోనే ఆయనకు పార్టీ అధిష్ఠానం చెక్ పెడుతుందని కూడా వినవస్తోంది.