అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మాదిరిగా దుబారా ఖర్చులు ఇక ఉండవని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందని కూడా ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సంబంధించి ఆర్భాటాలకు పోకుండా నిరాడంబరంగా ఏర్పాట్లు చేయాలనీ, సాధ్యమైనంత ఖర్చు తగ్గించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సూచించారని ఆరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం తెలియజేశారు. ఇదే విషయాన్ని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా నేడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
గత ప్రభుత్వంలో మాదిరాగా దుబారా ఖర్చులను సిఎం జగన్మోహనరెడ్డి ప్రోత్సహించరని తెలియజేశారు. దుబారా ఖర్చులను సిఎం జగన్ కట్టడి చేశారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి రూపాయి వ్యయానికి ఈ ప్రభుత్వంలో అకౌంటబులిటీ ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నారు. హిమాలయా వాటర్ బాటిల్స్ కార్యక్రమాల్లో కనిపించవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదని విజయసాయి రెడ్డి విమర్శించారు.