అమరావతి: మనీ లాండరింగ్ దళారీ సానా సతీశ్ కేసు వ్యవహారంలో బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా స్టోరీలు వెలుగు చూస్తాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు.
మనీ లాండరింగ్ దళారి సానా సతీశ్ని సిబిఐ అరెస్టు చేసిందనీ, చంద్రబాబు కోవర్టు బాలినేని గాంధీ, సతీశ్ దుబాయిలోని ఒక హోటల్లో రహస్యంగా కలిశారని ఇడిలో విచారణలో తేలినట్లు మీడియాలో వచ్చిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా స్టోరీలు వెలుగులోకి వస్తాయని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
మనీ లాండరింగ్ దళారి సానా సతీశ్ని సీబీఐ అరెస్ట్ చేసింది. EDలో చంద్రబాబు కోవర్టు బొల్లినేని గాంధీ, సతీశ్ దుబాయిలోని ఒక హోటల్లో రహస్యంగా కలిశారని విచారణలో తేలినట్లు మీడియాలో వచ్చింది. ఇందులో బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా స్టోరీలు వెలుగు చూస్తాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 4, 2019