అమరావతి: గ్రూపు 2 పరీక్షలు నెల రోజులు వాయిదా వేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కోరారు. ‘ఉత్తరాంధ్రలో తుఫాను పునరావాస పనులు జరుగుతున్నాయి, మరో పక్క ఎన్నికల కోడ్ అమలులో ఉండగా గ్రూపు 2 పరీక్షలు నిర్వహించడం ఏమిటి, పరీక్షలను మరో నెల రోజులు వాయిదా వేయలేరా’ అని విజయసాయిరెడ్డి శనివారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఎపిపిఎస్సి చైర్మన్ దేనికో హడావుడి పడుతున్నట్లు కనిపిస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని గ్రూపు 2 పరీక్షలను వాయిదా వేయించాలని విజయసాయిరెడ్డి కోరారు.
మరో ట్వీట్లో ఓడిశా సిఎంతో చంద్రబాబు మాట్లాడటంపై విమర్శ చేశారు.
‘పోని తుఫాను సహాయ చర్యలకు తమ హెల్ప్ కావాలంటే చెప్పాలని ఒరిశా సిఎంకు చంద్రబాబు అడిగారట. గతంలో తిత్లీ తుఫాను తీరం దాటక ముందే ‘థ్యాంక్యూ సిఎం సార్, తుఫాను నుండి మా ప్రాణాలు రక్షించినందుకు’ అని సొంతంగా హోర్డింగులు పెట్టించుకున్నట్టే ఉంది ఈ వ్యవహరం కూడా అని విజయసాయిరెడ్డి విమర్శించారు.