విభజన సమస్యల పరిష్కారానికి గానూ నిన్న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏపి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో విశాఖ రైల్వే జోన్ ను ఇవ్వడం సాధ్యం కాదంటూ కేంద్ర హోంశాఖ వర్గాలు చెప్పినట్లుగా పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.ఈ నేపథ్యంలో రైల్వే జోన్ అంశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై వచ్చిన వార్తలు అన్నీ తప్పుడు ప్రచారమని అన్నారు. కొందరు పని కట్టుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. వాస్తవానికి నిన్నటి సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకే రాలేదని ఆయన పేర్కొన్నారు.
విశాఖ రైల్వే జోన్ వచ్చి తీరుతుందనీ, రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు విజయసాయి రెడ్డి. జగన్ సర్కార్ పై బురద చల్లేందుకే ఎల్లో మీడియా ఇలాంటి తప్పుడు వార్తలను రాస్తొందని ఆయన మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ అనేది విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉందని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే జోన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనడంతో పాటు కేంద్రం ఆమోదించినా ప్రజల్లో ఆయోమయాన్ని సృష్టించేందుకు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యత్నిస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. మోర పక్క ఈ అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు కూడా స్పందించారు. విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపిందనీ, రైల్వే జోన్ ఏర్పాటునకు కేంద్రం చర్యలు కూడా ప్రారంభించిందని జీవీఎల్ పేర్కొన్నారు.
Breaking: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇండోస్పిరిట్ గ్రూప్ ఎండీ సమీర్ మహేంద్రుడిని అరెస్టు చేసిన ఈడీ