అమరావతి: టిడిపి హయాంలో కార్పోరేషన్లు, ప్రభుత్వ సంస్థల ద్వారా రుణంగా తెచ్చిన లక్ష కోట్ల రూపాయలు ఏమయ్యాయో అంతుబట్టడం లేదని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా శనివారం చంద్రబాబు పరిపాలనపై విమర్శలు గుప్పించారు.
విచ్చల విడిగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించారనీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఐదేళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రపంచంలోనే ఐదో పెద్ద సిటీ చేస్తామన్న అమరావతి గ్రాఫిక్స్ దశలోనే ఉందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
తుఫాను కరువు కాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుందని విజయసాయి అన్నారు. 29వేల కోట్ల రూపాయల కేటాయింపు రైతన్నలను సంక్షోభం నుండి గట్టెక్కిస్తుందని విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వడ్డీలేని రుణం, ధరల స్థిరీకరణ నిధి, రైతులకు పంట రుణాలు చరిత్రలో నిలిచిపోతాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన మాటను జగన్ నిలుపుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.